Tuesday, May 14, 2024

పుదుచ్చేరి సీఎం రంగస్వామికి కరోనా పాజిటివ్‌

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడ్డారు. తాజాగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి కరోనా నిర్ధార‌ణ అయ్యింది. క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో నిన్న ఆయ‌న పుదుచ్చేరిలోని ఇందిరాగాంధీ ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలో క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. అందులో ఆయ‌న‌కు పాజిటివ్‌గా తేలింది. దీంతో చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం రంగ‌స్వామి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కాగా, పుదుచ్చేరి ముఖ్య‌మంత్రిగా రంగ‌స్వామి గ‌త శుక్ర‌వారం(మే 7) ప్ర‌మాణ స్వీకారం చేశారు. సీఎంగా బాధ్యతలు చేప‌ట్టిన నాలుగు రోజుల‌కే ఆయ‌న క‌రోనా బారిన ప‌డ్డారు.

ఇవికూడా చదవండి: మంత్రి అప్పలరాజుపై పోలీసులకు ఫిర్యాదు.. ఏం చేస్తారో మరి?

Advertisement

తాజా వార్తలు

Advertisement