Wednesday, May 1, 2024

అమెరికాలో రక్త సింధూరం.. కాల్పుల్లో 12 మంది మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు వేర్వేరు ఘటనల్లో 12 మంది మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి కొలరాడో మొబైల్‌ హోమ్‌ పార్క్‌ లో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో ఓ దుండగుడు కాల్పులు జరుపడంతో ఏడుగురు మృతి చెందారు. ఆ తర్వాత దుండగుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుల్లో ఒకరిది పుట్టిన రోజు వేడుక అని తెలిపారు. ఉడ్‌ల్యాండ్‌లో పొరుగువారిపై ఓ వ్యక్తి కాల్పులు జరుపడంతో ముగ్గురు మృతి చెందారు. నిందితుడిపై పోలీసులు ఎదురుకాల్పులు చేయగా.. దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే కాల్పులకు గల కారణాలేమిటో తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు. కాగా, అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: తెలంగాణ మినహా అంతటా లాక్ డౌన్!

Advertisement

తాజా వార్తలు

Advertisement