Thursday, April 18, 2024

కరోనా బాధితులకు బాలయ్య మరో సహాయం

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాలలో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీనికి తోడు మందుల కొరత వెంటాడుతోంది. అయితే తాజాగా అనంతపురం జిల్లా హిందూపురంలోని కరోనా బాధితుల కోసం 30 లక్షల రూపాయల విలువైన మందులను ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ నుంచి పంపించారు.

ఈ నేపథ్యంలోనే మాట్లాడుతూ… కరోనా బాధితులు తొందరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఆ మందులను స్థానిక టిడిపి నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ కు అందించారు. మరో రెండు రోజుల్లో ఇంకో 15 లక్షల విలువ చేసే మందులను ఆస్పత్రికి అందిస్తానని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement