Thursday, April 25, 2024

మంత్రి అప్పలరాజుపై పోలీసులకు ఫిర్యాదు.. ఏం చేస్తారో మరి?

ఏపీ మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజుపై కర్నూల్‌ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇటీవల ఓ టీవీ ఛానల్‌లో చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అప్పలరాజు.. కర్నూలులో కరోనా కొత్తరకం మ్యుటెంట్‌ ఎన్‌-440కే వైరస్‌ విస్తరిస్తోందని అన్నారని పోతురాజు రవికుమార్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంత్రి వ్యాఖ్యలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడిన మంత్రిపై వెంట చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఇప్పటివరకు మంత్రిపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. పూర్తి విచారణ అనంతరం నిబంధనలకు అనుగుణంగా ఆయనపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement