Monday, May 20, 2024

ల‌క్నోల‌ని సిహారి శివాల‌యంలో ‘ప్రియాంక‌గాంధీ’ ప్ర‌త్యేక పూజ‌లు

ల‌క్నోలోని సిహారి శివాల‌యంలో మ‌హాదేవుని ద‌ర్శ‌నం చేసుకున్నారు కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక‌గాంధీ వాద్రా. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా క్యూలో నిలబడి దైవ‌ద‌ర్శ‌నం చేసుకున్నారు ప్రియాంక‌. అనంతరం సిద్ధార్థనగర్‌లో బహిరంగ సభలకు బయలుదేరారు. ప్రజలను కూడా కలుసుకున్నారు. మంగళవారం ఉదయం నుంచే నగరంలోని ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. మహాశివరాత్రి సందర్భంగా సోమవారం సాయంత్రం నగరంలోని ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయాల్లో మహాదేవునికి ఆకర్షణీయమైన అలంకరణ చేశారు. సందర్శన అనంతరం ఆలయం వెలుపల ప్రియాంక గాంధీ చిన్నారులతో సమావేశమయ్యారు. నేడు ఆమె ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఇక్కడి నుంచి సిద్ధార్థనగర్‌లోని బహిరంగ సభకు బయలుదేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement