Saturday, April 27, 2024

PM Modi: గాంధీ ఆశయాలను సమిష్టిగా సాధిద్దాం

జాతిపిత మహాత్మా గాంధీ 74వ వర్ధంతి సందర్భంగా దేశ నాయకులంతా ఆయనను స్మరించుకుంటున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి గాంధీజీని స్మరించుకుంటూ రాజ్‌ఘాట్‌లోని నివాళులర్పించారు. ‘మహాత్మ గాంధీ పుణ్యతిథి నాడు బాపూజీ గారిని స్మరించుకుంటున్నారు. ఆయన ఉదాత్తమైన ఆశయాలను మరింత ప్రాచారంలోకి తీసుకురావడం కోసం సమిష్టిగా ప్రయత్నించాలి. ఈ రోజు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మన జాతిని ధైర్యంగా కాపాడిన మహనీయులందరికీ నివాళులు అర్పిస్తున్నాము. వారి సేవ, ధైర్యసాహసాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి” అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement