Saturday, May 4, 2024

జిల్లాల అభివృద్ధిపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్

దేశంలోని వెనకబడ్డ జిల్లాల అభివృద్ధిపై, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు పురోగతి, ప్రస్తుత స్థితిగతులపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్ లో ప‌లు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, అధికారులు పాల్గొన్నారు. నీతి ఆయోగ్ ఆధ్వ‌ర్యంలో ఈ వీడియో కాన్ఫ‌రెన్స్ జ‌రిగింది. ఇందులో తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయం నుంచి ఏపీ సీఎం వైఎస్‌ జగన్ కూడా పాల్గొన్నారు. ప‌లు అంశాల ప్రగతిపై నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ స‌మావేశంలో సీఎంల‌కు మోడీ ప‌లు సూచ‌న‌లు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement