Saturday, April 27, 2024

కేంద్ర మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలిపిన ప్ర‌ధాని మోడీ..ఎందుకో తెలుసా..

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి డాక్ట‌ర్ భాగ‌వ‌త్ క‌ర‌ద్ కి ధ‌న్య‌వాద్యాలు తెలిపారు. నిన్న ఢిల్లీ నుంచి ముంబై బయల్దేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన గంటకు ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురైన ఘటనలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భాగవత్ కరద్ చూపిన చొరవను మోడీ ప్రశంసించారు. మంత్రి అయినా తన వృత్తి ధర్మాన్ని మరిచిపోలేదని.. ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడారని ప్రశంసల జల్లు కురిపించారు. ఫ్లైట్ లో ప్రయాణికుడికి ప్రథమ చికిత్స అందించిన కేంద్రమంత్రికి తోటి ప్రయాణికులు సంతోషాతిరేకాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement