Saturday, April 27, 2024

Live: హైద‌రాబాద్‌కు వ‌స్తున్న‌ ప్ర‌ధాని మోదీ.. మ‌ధ్యాహ్నం 2గంట‌ల‌ నుంచి లైవ్‌

https://youtu.be/GeqPW0iVqK4

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవ్వాల హైద‌రాబాద్ వ‌స్తున్నారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ 20వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో భారీగా సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఐఎస్‌బీ స్నాతకోత్సవ కార్యక్రమంలో మొత్తం 930 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. వీరిలో మొహాలీ క్యాంపస్ కు చెందిన 330 విద్యార్థులు కూడా ఉండనున్నారు. దీంతో మొత్తం 930 మంది సోషల్ మీడియా ఖాతాలను కూడా ఎస్పీజీ అధికారులు జల్లెడపడుతున్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఏవైనా పోస్టులు పెట్టారా? అని వాళ్ల అకౌంట్లను చెక్ చేస్తున్నారు. అంతేకాక, విద్యార్థుల బ్యాక్ గ్రౌండ్ ను కూడా ఎస్పీజీ అధికారులు పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. ఈ విషయాల్లో ఏ సమస్య లేదని తేలితేనే విద్యార్థులకు ఎంట్రీ పాసులు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో గోల్డ్ మెడల్ సాదించిన 8 మందికి ప్రధాని మోదీ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందించనున్నట్లు ఐఎస్‌బీ డీన్ మదన్ పిల్లుట్ల చెప్పారు.

కాగా, ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన లైవ్​ కోసం ఈ లింక్​ క్లిక్​ చేసి నేరుగా స్మార్ట్​ఫోన్​లోనే చూడొచ్చు..

https://youtu.be/GeqPW0iVqK4
Advertisement

తాజా వార్తలు

Advertisement