Saturday, April 27, 2024

వాహనదారులకు షాక్… పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

గత కొద్ది రోజులుగా స్థిరంగా కొనసాగిన పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారీ ధరల సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 30 పైసలు వడ్డించాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.64కు చేరగా.. డీజిల్ ధర రూ.89.87కు పెరిగింది. ముంబైలో పెట్రోల్ ధర 23 పైసలు పెరిగి రూ.107.71కు, లీటర్ డీజిల్ ధర 32 పైసలు పెరిగి రూ.97.52 వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.105.74 ఉండగా.. డీజిల్‌ ధర రూ.98.06కి చేరింది.

ఇది కూడా చదవండి: సినిమా టికెట్ల రేట్లు మీ ఇష్టం: పవన్

Advertisement

తాజా వార్తలు

Advertisement