Friday, April 19, 2024

దేశంలో కొత్తగా 23 వేల మందికి కరోనా

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 23,529 మంది కరోనా బారిన పడ్డారు. గత 24 గంటల్లో 28,718 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, కొత్తగా 311 మంది మృతిచెందారు. తాజాగా కేసుల్లో అత్యధికంగా కేరళలోనే నమోదు అయ్యాయి. కేరళలో 12,161 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 155 మంది మరణించారని తెలిపింది.

దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,37,39,980కు చేరింది. ఇందులో 3,30,14,898 మంది కరోనా నుంచి బయటపడ్డారు. మరో 4,48,062 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 2,77,020 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నది. నిన్న ఒక్కరోజే 65,34,306 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు 88,34,70,578 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా..

Advertisement

తాజా వార్తలు

Advertisement