Saturday, May 4, 2024

అక్కడ కరోనా కేసులు లేవట!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి. అయితే, అండమాన్ నికోబార్ దీవిలో కొత్తగా ఒక్క కొవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. గడిచిన 24 గంటల్లో ఒక్కరికీ వైరస్​ సోకలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.  700-800 వరకు పర్యటకులు వస్తున్నా పరిస్థితి అదుపులో ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.అండమాన్​ దీవులకు పర్యటకులు పెరుగుతున్నా ఆ ప్రాంతంలో కొవిడ్​ కేసులు నమోదుకాకపోవడం గమనార్హం. ప్రస్తుతం 8 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 4,969 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు 62 మంది మృతి చెందారు. గతేడాది జూలై 27న తొలి మరణం నమోదు అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement