Friday, May 17, 2024

నాడు – నేడుతో ఉత్త‌మ ఫ‌లితాలుః డిజిపి గౌత‌మ్ స‌వాంగ్..

గుంటూరు: ముఖ్యమంత్రి జగన్మో‌హన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగానే పోలీస్ శాఖలో మార్పులు చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యానించారు. మంగళవారం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం తీసుకున్న నాడు – నేడు కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పారు. పోలీస్ శాఖలో కూడా నాడు – నేడు ద్వారా పోలీస్ స్టేషన్లు ఆధునీకరించడం సంతోషంగా ఉందని చెప్పారు. 1025 నేషనల్ అవార్డు, రివార్డులను ఏపీ పోలీసులు తీసుకోవడం జరిగిందన్నారు. టెక్నాలజీ పరంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా ముందున్నారని చెప్పారు. గత ఎన్నికలతో పోల్చితే రాష్ట్రంలో మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయని చెప్పారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ఏపీ పోలీసులు సేవలు అందించారన్నారు. మహిళా హోంమంత్రి సుచరిత ఆధ్వర్యంలో మహిళా సేఫ్టీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement