Friday, May 3, 2024

దేవరకద్రలో దొంగతనాలు..

దేవరకద్ర : మండల కేంద్రంలో రెండు రోజులుగా దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెల్లవారుజామున రెండు షాపులు దొంగతనాలు జరిగాయి. గ్రామ నడిబొడ్డు అయిన పోచమ్మ దేవాలయ సమీపంలో ఉన్న బాబు అనే చిన్న షాపులో గుర్తు తెలియని వ్యక్తులు దరువాదలు పగలగొట్టి అందులో ఉన్న నగదు మూడు వేల రూపాయలు తీసుకువెళ్లినట్లు బాధితులు తెలిపారు. అలాగే కొత్త బస్టాండ్‌ సమీపంలో కూడా ఒక పాన్‌ డబ్బా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న సిగరెట్లు మొత్తం దొంగతనం చేయడం జరిగిందని బాధితులు తెలిపారు. సుమారు ఐదు వేల పైనే నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. అలాగే సోమవారం ఉదయాన కూడా ఆంబులెన్స్‌ డ్రైవర్‌లకు సంబంధించిన మూడు సెల్‌ఫోన్‌లు , పర్సులు దొంగతనాలు అయినట్లు బాధితులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సిసి కెమెరాలు లేకపోవడం వల్లనే గ్రామంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు. పోలిసులు కూడా దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ముమ్మరంగా పెట్రోలింగ్‌ లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement