ఆన్లైన్ స్ట్రీమింగ్యాప్ నెట్ఫ్లిక్స్లో మరో అద్భుతమైన క్రైమ్, సస్పెన్స్కు చెందిన వెబ్ సిరీస్ రానుంది. ఢిల్లీ, దాని చుట్టుపక్కల జరిగిన యధార్థ ఘటనల ఆధారంగా ఈ వెబ్సిరీస్ రూపొందించారు. దేశ రాజధాని, ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ప్రజలను దారుణంగా చంపేస్తూ.. వారి శరీర భాగాలను చెల్లా చెదురుగా పడేస్తూ.. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగిన ఓ హంతకుడి చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ సీరియల్ కిల్లర్ కేసుపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తునకు సంబంధించిన కీలక సన్నివేశాలు కూడా ఉండనున్నాయి.
కాగా, స్ట్రీమింగ్ సర్వీస్ నెట్ఫ్లిక్స్ మంగళవారం తన తాజా క్రైమ్ డాక్యుమెంట్ -సిరీస్ ‘‘ఇండియన్ ప్రిడేటర్: ది బుట్చర్ ఆఫ్ ఢిల్లీ’’ అనే పేరుతో జూలై 20న వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తున్నట్టు ఇవ్వాల (మంగళవారం) ప్రకటించింది. దీనికి ఆయేషా సూద్ దర్శకత్వం వహించగా.. వైస్ ఇండియా నిర్మాణ సారథ్యం వహించింది. ఈ షో నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించినట్టు మేకర్స్ తెలియజేశారు.
ఓ క్రూరమైన నర హంతకుడి అరెస్టుకు దారితీసిన సంఘటనల క్రమాన్ని ఈ వెబ్ సిరీస్లో చూడొచ్చని నెట్ఫ్లిక్స్ తెలిపింది. దేశంలో నాన్-ఫిక్షన్ స్పేస్ రోజు రోజుకూ డెవలప్ అవుతోందని, రివర్టింగ్ స్టోరీని రూపొందించడంలో భాగమైనందుకు తాను చాలా సంతోషంగా ఉన్నట్టు డైరెక్టర్ ఆయేషా తెలిపారు. ఈ కథను, దాని తర్వాత జరిగిన పరిశోధనను అర్థం చేసుకోవడం.. మానవ మేధస్సు, న్యాయ వ్యవస్థ గురించి కూడా చాలా తెలుసుకోవడానికి తనను ముందుకు నడిపించినట్టు తెలిపారు.
ఈ డాక్యుమెంట్-సిరీస్ ని నెట్ఫ్లిక్స్ లో ప్రదర్శించడానికి తాను ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నట్టు చెప్పింది. అప్పట్లో ఈ కేసు దేశాన్ని కుదిపేసి ఉండాల్సింది.. కానీ, ప్రింట్అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా ఇంతగా డెవలప్ కాలేదన్నారు. అందుకే ఇది జనాలకు తెలియకుండా మిస్ అయ్యిందన్నారు ఆయేషా సూద్.