Saturday, April 27, 2024

అక్ర‌మంగా 60 ఒంటెల త‌ర‌లింపు – కాపాడిన న‌వ‌నీత్ కౌర్

రాజ‌స్థాన్ నుండి హైద‌రాబాద్ కు అక్ర‌మంగా ఒంటెల‌ను త‌ర‌లిస్తున్నారు వ్యాపారులు. ప‌క్కా స‌మాచారంతో ఒక‌ప్ప‌టి న‌టి, పార్ల‌మెంట్ స‌భ్యురాలు న‌వ‌నీత్ కౌర్ ఒంటెల ర‌వాణాని అడ్డుకున్నారు. ఈ మేర‌కు అక్ర‌మంగా త‌ర‌లిస్తోన్న 60మూగ‌జీవాల ప్రాణాల‌ను ఆమె కాపాడారు. కాగా ఇప్ప‌టికే చాలా ఒంటెల‌ను హైద‌రాబాద్ కు త‌ర‌లించారు. అమరావతి నియోజకవర్గంలో ఒంటెలను ఉంచినట్టు త‌న‌కు సమాచారం అందిందని చెప్పారు. వెంటనే అధికారులకు సమాచారం అందించాను. అధికారులు స్పందించి ఒంటెలను స్వాధీనం చేసుకున్నార‌ని వెల్ల‌డించారామె. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నవనీత్ కౌర్ తెలుగులో అధికంగా సినిమాలు చేశారు.

కన్నడ, మలయాళ, తమిళ్ తో పాటు పంజాబీలో ఒకటి రెండు చిత్రాలు చేశారు. రాజమౌళి -ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన యమదొంగ మూవీలో నవనీత్ కౌర్ ఓ స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్ తో పాటు స్టెప్స్ వేశారు. కెరీర్ ఆశాజకంగా లేకపోవడంతో ఆమె 2010లో సినిమాల నుండి తప్పుకున్నారు. 2011లో మహారాష్ట్రకు చెందిన పొలిటీషియన్ రవి రాణాను ఆమె వివాహం చేసుకున్నారు. 2014లో ఎంపీగా పోటీ చేసి పరాజయం పొందారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర అమరావతి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు. ఆమె ప్రజా సమస్యలపై పోరాడే తీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఒంటెల ప్రాణాల కోసం ఆమె చేసిన తాజా ప్రయత్నంతో మరోమారు వార్తల్లో నిలిచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement