Wednesday, April 24, 2024

కన్నతండ్రిని కిరాతకంగా నరికిన కొడుకు

కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలంలో దారుణం జరిగింది. రెడ్డిగూడెం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన చాట్ల లచ్చిఏసుపై అతని కొడుకు చాట్ల సురేష్ దాడి చేశాడు. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కత్తితో అతి కిరాతకంగా తండ్రి లచ్చిఏసుపై దాడి చేసి పరారయ్యాడు. స్థానికుల సహకారంతో గాయపడిన లచ్చిఏసును 108 అంబులెన్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement