Wednesday, May 8, 2024

జాతీయ‌వాదాన్ని అనుస‌రించే వారి త‌ర‌పున ప్ర‌చారం చేస్తా .. కంగ‌నార‌నౌత్ ..

తాను ఏ పార్టీకి చెందిన వ్య‌క్తిని కాద‌ని స్ప‌ష్టం చేసింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్. జాతీయ‌వాదాన్ని అనుస‌రించే వారి త‌ర‌పున తాను ప్ర‌చారం చేస్తాన‌ని తెలిపింది. ఉత్త‌ర‌ప్రదేశ్ బృందావన్‌లోని శ్రీకృష్ణ జన్మస్థానాన్ని సందర్శించిన కంగన అనంతరం విలేకరులతో మాట్లాడారు.. తన వ్యాఖ్యలు కొందరిని బాధించాయన్న వార్తలపై మాట్లాడుతూ.. నిజాయతీ, ధైర్యం, జాతీయవాదం, దేశం గురించి ఆలోచించే వారికి నేను చెబుతున్నది సరైనదేనని అనిపిస్తుందనిన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు నిజమైన శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూపిస్తారని ఆశిస్తున్నానని కంగన చెప్పారు. శ్రీకృష్ణుడు జన్మించిన స్థానంలో ఈద్గా ఉందని అన్నారు. చండీగఢ్‌లో రైతులు తన కారును అడ్డుకోవడంపై మాట్లాడుతూ.. తాను ఎప్పటికీ క్షమాపణలు చెప్పబోనన్నారు. దానిని తాను నిరసిస్తూనే ఉంటానని కంగన ఖ‌రాఖండింగా చెప్పారు. మ‌రి ఈమె వ్యాఖ్య‌ల‌పై ఎలాంటి దుమారం లేస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement