Saturday, April 27, 2024

అవినీతి మరకలేని వ్యక్తి రోశయ్య: బండి

తెలుగు రాజకీయలు ఉన్నంత కాలం ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రోశయ్య జీవించి ఉంటారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం ఆయన రోశయ్య పార్థివ దేహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం రోశయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆర్థిక మంత్రి అంటే మెదట గుర్తొచేది రోశయ్యేనని తెలిపారు. అవినీతి మరకలేని వ్యక్తి అని, రాజకీయాల్లో రోశయ్య నిజాయితీ పరుడని కొనియాడారు. రోశయ్య కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement