Sunday, May 19, 2024

దివంగ‌త న‌టుడు ‘పునీత్ రాజ్ కుమార్’ కి డాక్ట‌రేట్ – అవార్డు అందుకున్న ‘అశ్వ‌ని’

మైసూర్ యూనివ‌ర్సిటీ దివంగ‌త క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కి డాక్ట‌రేట్ ఇచ్చి గౌర‌వించింది. ఈ అవార్డును పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వ‌నికి ప్ర‌ధానం చేశారు. మైసూర్ యూనివ‌ర్సిటీ 102వ స్నాత‌కోత్స‌వంలో భాగంగా పునీత్ రాజ్ కుమార్ కు డాక్ట‌రేట్ ను ప్ర‌ధానం చేశారు. పునీత్ రాజ్ కుమార్ కు డాక్టరేట్ ఇవ్వ‌డానికి ముందు.. క్రాఫోర్డ్ హాల్ లో పునీత్ రాజ్ కుమార్ ఫోటోల‌ను ఎల్ఈడీ తెర‌పై ప్ర‌ద‌ర్శించారు. అనంత‌రం గౌరవ డాక్ట‌రేట్ అవార్డును పునీత్ రాజ్ కుమార్ స‌తీమ‌ణి అశ్వ‌నికి ప్ర‌ధానం చేశారు. క‌న్న‌డ సూప‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గ‌త ఏడాది అక్టోబ‌ర్ నెల‌లో అక‌స్మాతుగా గుండె పోటుతో మ‌ర‌ణించారు. దీంతో యావత్ సినీ ప్ర‌పంచం పునీత్ రాజ్ కుమార్ కు నివాళి అర్పించింది. ఇటీవ‌ల పునీత్ రాజ్ కుమార్ చివ‌రి సారిగా న‌టించిన జేమ్స్ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా విడుద‌ల అయ్యే స‌మ‌యంలో కన్న‌డ‌లో ఏ సినిమా విడుద‌ల చేయ‌కుండద‌ని.. నిర్మాతలు నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో క‌న్నడలో అన్ని థీయేట‌ర్ల‌లో జేమ్స్ సినిమా విడుద‌ల అయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement