Friday, May 3, 2024

మురళీధరన్ కు అస్వస్థత.. సన్ రైజర్స్ కు ఇక ఇబ్బందే!

సన్‌ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురలీధరన్‌ అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్య రావడంతో ఆయన్ని… చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఏప్రిల్ 17నే ఆయన 49వ ఏట అడుగుపెట్టారు. పుట్టిన రోజు జరిగిన రెండు రోజులకే ఈ అనారోగ్య సమస్య రావడం క్రికెట్ ప్రపంచానికి ఆందోళన కలిగించింది. ప్రస్తుతం మురళీధరన్… అపోలో ఆస్పత్రిలోనే ఉన్నారు. మురళీధరన్‌కు యాంజియోప్లాస్టీ చేయబోతున్నట్లు తమిళ మీడియా తెలిసింది. మురళీధరన్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా, 2015 నుంచి మురళీధరన్ IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి కోచ్‌గా ఉంటున్నారు. ఇటీవల ప్రారంభమైన ఐపీఎల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు వరుసగా ఓటమి చవి చూస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement