Thursday, May 16, 2024

మెగాస్టార్ తో మహర్షి డైరెక్టర్ ?

చిరంజీవి రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత వేదాళం లూసిఫర్ రీమేక్ లలో నటించబోతున్నాడు. లుసిఫర్ రీమేక్ కు మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నారు. ఇక మరో కీలక పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి చెల్లిగా సుహాసిని కనిపించబోతోంది.

ఇదిలా ఉండగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఓ కథ చెప్పారట. మెసేజ్ తో పాటు పక్కా ఎంటర్టైన్మెంట్ గా సాగే ఈ స్క్రిప్ట్ ను మెగాస్టార్ వంశీకి చెప్పినట్లు సమాచారం. మెగాస్టార్ దీనిపై క్లారిటీ మాత్రం ఇంకా ఇవ్వలేదట.

Advertisement

తాజా వార్తలు

Advertisement