Thursday, May 2, 2024

కేంద్రంపై మా పోరాటం ఆగదు: బీజేపీ సర్కార్ పై కవిత ఫైర్

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద టీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. జీడీపీ పెంచమంటే.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచుతున్నదని విమర్శించారు. 2014లో పెట్రోల్‌ ధర రూ.60 ఉండేదని, ఆరోజు క్రూడాయిల్‌ ధర ఇంకా చాలా తక్కువ ఉందని గుర్తు చేశారు. నేడు ముడిచమురు ధర తక్కువ ఉన్నప్పటికీ పెట్రోల్‌ ధరలు పెంచారని విమర్శించారు. ఆయిల్‌ సబ్సిడీలు ఎత్తివేసి రూ.23 లక్షల కోట్లు కూడబెట్టుకున్నారని కవిత మండిపడ్డారు. డ్వాక్రా మహిళలు, రైతులకు ఒక్క రూపాయి రుణమాఫీ చేయలేదు కానీ.. రూ.11 లక్షల కోట్ల కార్పొరేట్‌ రుణాలు మాఫీ చేశారని ఆరిపంచారు.  కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణ రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలను రోడ్లపైకి తెచ్చిన ఘనత మోదీ సర్కార్‌కు దక్కుతుందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement