హైదరాబాద్ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు ఏపీ సీఎం జగన్ కి నోటీసులు జారీ చేసింది. 2014ఎన్నికల సమయంలో హుజుర్ నగర్ లో ఎన్నికల కోడ్ ని జగన్ ఉల్లంఘించారు. కాగా నేడు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణ జరిపింది.ఈ సందర్భంగా… సీఎం జగన్ మోహన్ రెడ్డి..ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లు కోర్టు తేల్చింది. ఈ నేపథ్యంలోనే కోర్టుకు హాజరు కావాలంటూ తాజాగా నోటీసులు జారీ చేసింది నాంపల్లి కోర్టు. ఈ నెల 28 వ తేదీన కోర్టు కు హాజరు కావాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సమన్లు జారీ చేసింది నాంపల్లి కోర్టు. దీనిపై ఏపీ సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటారో తెలియాల్సి ఉంది. కాగా.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే పలు అవినీతి ఆరోపణ కేసులు ఉన్న సంగతి తెలిసిందే.
Breaking : ఏపీ సీఎం జగన్ కి షాక్ – ‘నోటీసులు’ జారీ చేసిన నాంపల్లి కోర్టు
Advertisement
తాజా వార్తలు
Advertisement