Saturday, April 27, 2024

నిజామాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న మంత్రి కేటీఆర్

నిజామాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్. ఈ సంద‌ర్భంగా ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కి శంకుస్థాప‌న చేయ‌నున్నారు. అనంత‌రం బహిరంగ సభలో పాల్గొంటారు. సిద్దాపూర్ గ్రామంలో నిర్మించబోతున్న రిజర్వాయర్ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. ఈ రిజర్వాయర్ ను రూ. 119.41 కోట్లతో నిర్మించబోతున్నారు. అనంతరం 10:45 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీని తర్వాత 11 గంటలకు జరగబోయే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 :30 గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ కు బయలు దేరుతారు. కాగ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రంగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా మంత్రితో నిజామాబాద్ జిల్లా పర్యటనలో పాల్గొంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement