Saturday, May 4, 2024

సంచలనం రేపిన టీచర్ హత్య కేసులో వీడిన మిస్టరీ

గత ఏడాది నవంబర్ 16న కదిరిలో సంచలనం కలిగించిన టీచర్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ పకీరప్ప మీడియా సమావేశంలో తెలిపారు. ఆయన అందించిన వివరాల మేరకు..కదిరి ఎన్జీవో కాలనీ లో   మర్డర్  ఫర్ గేయిన్ కేసులో పోలీసులు నిందితుడిని  అరెస్టు చేశారు.  హంతకుడు కదిరి పట్టణానికి చెందిన షేక్ షఫీ గా పోలీసులు గుర్తించారు.  గత ఏడాది నవంబర్ 16న టీ హోటల్ నిర్వాహకుడు రమణ ఇంటి లోనికి ప్రవేశించిన దుండగుడు షఫీ, రమణ భార్య శివమ్మ పై రాడ్డుతో దాడి చేసి బంగారం, నగదు దోచుకుని వెళ్తున్న సమయంలో పక్క ఇంటిలో ఉంటున్న  టీచర్ శంకర్ రెడ్డి వాకింగ్ వెళ్లాడాన్ని గమనించిన షఫీ  శంకర్ రెడ్డి ఇంటిలోకి ప్రవేశించి ఆయన భార్య టీచర్ ఉషారాణిపై రాడ్డుతో దాడి చేసి ఇంట్లోనే బంగారాన్ని దోచుకెళ్లాడు

ఉషారాణి మృతి చెందడంతో సంచలనంగా మారిన కేసును జిల్లా ఎస్పీ పక్కిరప్ప ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిల్లాలోని నిష్ణాతులైన పోలీసులను సుమారు 50మందిని 10 టీమ్లుగా ఏర్పాటు చేశారు. స్పెషల్ టీంలు  మూడు నెలల పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం విచారణ చేపట్టారు. సుమారు మూడు నెలల విచారణ అనంతరం పోలీసులు పురోగతి సాధించారు. కదిరి పట్టణానికి చెందిన షేక్ షఫీ నిందితుండని పోలీస్ విచారణలో తేటతెల్లమైంది. ఎన్జీవో కాలనీలో శివమ్మ పై దాడి చేసి టీచర్ ఉషారాణిని హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. కదిరిలో కారు డ్రైవర్ గా పని చేసే షేక్ షఫీ ఇదివరకే కదిరి పట్టణంలో ఇదే రీతిలో రాడ్డుతో మహిళలపై దాడి చేసి మరో మూడు దోపిడీలు చేసినట్లు పోలీసుల విచారణలో షఫీ ఒప్పుకున్నట్టు సమాచారం. నిందితుడు  నుంచి సుమారు అర కేజీ బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement