Saturday, May 4, 2024

విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలి: మంత్రి గంగుల ఆదేశం

ఆటో ప్రమాదంలో గాయపడి సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇల్లంతకుంట మండలంకు చెందిన 8 మంది డిగ్రీ విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వైద్యులకు సూచించారు. శనివారం ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్ తో కలసి గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement