Wednesday, April 24, 2024

Flash: ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో ప్రైవేటు బస్సు బోల్తా.. పలువురు మృతి

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు బోల్తాపడి పలువురు మృతి చెందారు. కర్ణాటకలోని పావగడ పలవలహళ్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వై.ఎన్‌.హొసకోట నుంచి పావగడకు వెళ్తున్న ప్రైవేటు బస్సు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమానికి గురైంది. పావగడలోని ఆస్పత్రికి క్షతగాత్రుల తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement