Monday, May 6, 2024

మరోసారి ఉదారతను చాటుకున్న మంత్రి ఎర్రబెల్లి

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆపదలో ఉన్న వారిని ఆదుకొని మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద గల నెల్లుట్ల ఫ్లైఓవర్ పై రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో జనగామ జిల్లా పర్యటనలో భాగంగా అటుగా వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి తన కాన్వాయ్‌ను ఆపారు. వెంటనే డీసీపీ, పోలీస్ లకు ఫోన్ చేసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ లోగా చుట్టుముట్టు ప్రజలు చేరారు. వారి సహాయంతో గాయపడిన వారిని పక్కన కూర్చోపెట్టారు. క్షతగాత్రులను దగ్గరుండి జనగామ దవాఖానకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement