Saturday, April 27, 2024

కేసీఆర్ ని క‌లిసిన – తెలంగాణ రాష్ట్ర బిసి క‌మిష‌న్ చైర్మ‌న్ స‌భ్యులు

బెంగళూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు తెలంగాణ రాష్ట్ర బి.సి. కమిషన్‌ చైర్మన్‌ సభ్యులు. గత రెండు రోజులుగా తమ అధ్యయనంలో భాగంగా కర్ణాటక రాష్ట్రం పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర బి.సి. కమిషన్‌ బృందం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును మర్యాదపూర్వకంగా కలిసింది. బెంగళూర్‌కు వచ్చిన కేసీఆర్‌ను స్థానిక లీలా ప్యాలెస్‌లో తెలంగాణ రాష్ట్ర బి.సి. కమిషన్‌ చైర్మన్‌ డా॥ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు సారధ్యంలో సభ్యులు సి.హెచ్‌. ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్‌ నూలి, కె.కిషోర్‌గౌడ్‌లు ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ అధ్యయన వివరాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు. మరో రెండు రోజులపాటు ఇక్కడే ఉండి ముఖ్య ప్రభుత్వ అధికారులు, న్యాయ నిపుణులు, సామాజిక వేత్తలు, తదితరులను కలుసుకోనున్నట్లు చైర్మన్‌ వివరించారు. బి.సి. కమిషన్‌ కొనసాగిస్తున్న అధ్యయన వివరాలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు, ఇదే విధంగా ప్రత్యేక స్పూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement