Wednesday, April 24, 2024

Breaking : అంద‌మైన కోన‌సీమ‌లో చిచ్చు పెట్టిన ఘ‌న‌త వైసీపీదే – చంద్ర‌బాబునాయుడు

అంద‌మైన కోన‌సీమ‌లో చిచ్చు పెట్టిన ఘ‌న‌త వైసీపీదేన‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అన్నారు. అమ‌లాపురం అల్ల‌ర్ల‌పై ఆయ‌న మాట్లాడారు. పోలీసుల స‌మక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి చేశార‌న్నారు. మంట‌ల‌ను అదుపు చేసేందుకు ఫైరింజ‌న్ లు కూడా రాలేద‌న్నారు. వారి ఇళ్ల‌ను వారే త‌గుల‌బెట్టుకుని వేరే వాళ్ల‌పై నింద‌లు వేస్తున్నార‌ని మండిప‌డ్డారు. మధ్యంత‌రానికి సీఎం జ‌గ‌న్ సిద్ధ‌ప‌డుతున్నార‌న్నారు.మహానాడును అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒంగోలులో మా సభకు మైదానం ఇవ్వరా? మా ఫ్లెక్సీలు చించేస్తారా? మహానాడును మేమేమీ అడ్డుకోవడం లేదని ఓ మంత్రి అంటున్నాడు. మహానాడును ఆపగలమని మీరు అనుకుంటున్నారా? టీడీపీ మహానాడు ఓ ప్రభంజనం. నాకు కోపం వస్తే ఎవరిని వదిలేది లేదు. పిచ్చివేషాలు వేయకుండా మీరు మర్యాదగా ఉంటే సరి… లేకపోతే తోకలు కత్తిరించి పంపుతాం” అంటూ చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement