Wednesday, May 8, 2024

మార్చి 25న – ఓటీటీలో ‘వ‌లిమై’

యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన చిత్రం వలిమై. ఈ చిత్రాన్ని వినోద్ తెర‌కెక్కించాడు. ఈసినిమా దొపిడీ, క్రైమ్, రేసింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. త‌మిళ స్టార్ హీరో అజిత్ హీరోగా న‌టించ‌గా.. తెలుగు హీరో కార్తికేయ విలన్ గా నటించాడు. బాలీవుడ్ బ్యూటీ హ్యమా ఖురేషీ.. అజిత్ సరసన నటించింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల అయింది. అయితే.. ఫిబ్రవరి 24 వ తేదీన విడుదలైన వాలిమై మూవీకి మంచి టాక్‌ వస్తోంది. అయితే.. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. ఈ మూవీ మార్చి 25వ తేదీన ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటన చేసింది చిత్ర బృందం. ఈ లెక్కన మార్చి 25 వ తేదీన జీ-5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. కాగా.. ఈ సినిమాలో ఇప్పటికే 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement