Saturday, April 27, 2024

ప్రజా కోర్టులో శిక్ష తప్పదు: మావోయిస్టు లేఖతో టిఆర్ఎస్ శ్రేణులు గుబులు

తెలంగాణ- ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని ధర్మవరం గ్రామంలో మావోయిస్టు కరపత్రాలు వెలిసాయి. టిఆర్ఎస్ పార్టీ వైస్ ఎంపీపీ భర్త అల్లి సూరిబాబు టిఆర్ఎస్ నాయకుడు రంగు సంపత్ ను హెచ్చరిస్తూ మావోయిస్టులు కరపత్రాలు వదిలివెళ్లారు. అల్లి సూరిబాబు పోలీసు కొరియర్ గా వ్యవహరిస్తూ దొంగ పట్టాలతో ఇసుక దోపిడీ చేస్తున్నారని అదేవిధంగా ఐటిసి కంపెనీ పేరుతో రంగు సంపత్ రైతులను మోసం చేస్తున్నాడని అన్యాయానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ లేఖలో పేర్కొన్నారు. మండలంలో కరపత్రాలు కలకలం సృష్టించడంతో మండలంలోని టిఆర్ఎస్ శ్రేణులు గుబులు చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement