Saturday, April 20, 2024

పీఎస్‌లో అర్ధరాత్రి ఎంపీ నందిగం సురేష్‌ హల్‌చల్‌

విజయవాడలోని కృష్ణలంక పీఎస్‌లో అర్ధరాత్రి ఎంపీ నందిగం సురేష్‌ హల్‌చల్‌ చేశారు. ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో కొంతమంది యువకులను పోలీసులు పీఎస్‌కు తీసుకెళ్లారు. దీంతో ఎంపీ నందిగం సురేష్‌ అనుచరులమంటూ యువకులు హంగామా చేశారు. ఈక్రమంలో విషయం తెలుసుకున్న సురేష్‌ పీఎస్‌కు వెళ్లారు. ఎస్‌ఐతో ఎంపీ అనుచరులు వాగ్వాదానికి దిగారు. వీడియో తీస్తున్న కానిస్టేబుల్‌పై సురేష్‌ అనుచరులు దాడి చేసి, అతని ఫోన్‌ను లాక్కున్నారు. ఫోన్‌ అడిగిన కానిస్టేబుల్‌పై మళ్లీ చేయి చేసుకున్నారు. యువకుల్లో ఎంపీ సురేష్‌ బంధువు ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement