Sunday, April 28, 2024

ట్రోల‌ర్స్ పై మంచు ఫ్యామిలీ రివ‌ర్స్ ఎటాక్ – రూ.10కోట్ల‌కి ప‌రువు న‌ష్టం దావా

మంచు ఫ్యామిలీపై ఎక్కువ‌గా ట్రోల్స్ వ‌స్తుంటాయి. ఎక్కువ‌గా మంచు లక్ష్మీ ఈ ట్రోల్స్ బారిన ప‌డుతుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ట్రోల్స్ ని లైట్ తీసుకున్న మంచు ఫ్యామిలీ..ట్రోలర్స్‌పై రివర్స్ ఎటాక్‌ చేసింది. ట్రోలింగ్ ఆపకపోతే పరువు నష్టం దావా వేస్తామని మోహ‌న్ బాబు త‌న‌యుడు, న‌టుడు మంచు విష్ణు హెచ్చరించారు. సన్నాఫ్ ఇండియా బుకింగ్ , వసూళ్లపై ట్రోల్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో తమపై వచ్చిన వ్యాఖ్యలపై అనుచిత ట్రోలింగ్స్ ను తొలగించాలని శేషుకుమార్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచు ఫ్యామిలీ మెంబర్స్‌ మీద పర్సనల్ ఎటాక్ చేసినందుకు క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు పదికోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామని వారు వెల్ల‌డించారు. ఈ ఊహించ‌ని ప‌రిణామాన్ని ట్రోల‌ర్స్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement