Saturday, March 23, 2024

Breaking : గ్రామీణ బ్యాంక్ లో భారీ చోరీ – బ్యాంక్ ఖాతా నుండి రూ.1.28కోట్లు మాయం

ఆదిలాబాద్,తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో భారీ మోసం చోటు చేసుకుంది. బ్యాంక్ ఖాతా నుంచి రూ.1.28కోట్లు మాయ‌మ‌య్యాయి. రైతుల కిసాన్ క్రెడిట్ కార్డుల నుంచి డ‌బ్బులు డ్రా అయిన‌ట్లు గుర్తించారు. రైతుల కిసాన్ కార్డుల ద్వారా డ‌బ్బు డ్రా చేశాడు నిర్వాహ‌కుడు. దాంతో అప్ర‌మ‌త్త‌మైంది గ్రామీణ బ్యాంక్ యంత్రాంగం. ముగ్గురు ఆదివాసీ రైతుల కిసాన కార్డుల ద్వారా న‌గ‌దుని డ్రా చేశాడు క‌స్ట‌మ‌ర్ పాయింట్ నిర్వాహ‌కుడు. ముగ్గురు రైతుల‌కు రూ.16ల‌క్ష‌లు ముట్ట‌చెప్పి మిగిలిన సొమ్మును కాజేశాడు ర‌మేష్ అనే వ్య‌క్తి. ఈ మేర‌కు పోలీసుల‌కు స‌మాచారం అందించారు బ్యాంక్ అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement