Saturday, April 27, 2024

Goods train : పట్టాలు తప్పిన ఎల్పీజీ గూడ్స్‌ రైలు.. తప్పిన భారీ ప్రమాదం..

ఇటీవల జరిగిన బాలాసోర్ రైలు ప్రమాదంలో అత్యధిక సంఖ్యలో ప్రయాణీకులు చనిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురైన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటన మరువక ముందే ఎల్పీజీతో వెళ్తున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ సంఘటనతో మరో పెను ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భారత్‌ పెట్రోలియం సంస్థకు చెందిన ఎల్పీజీ కంటైనర్‌లతో వెళ్తున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. షాపురా భిటోని స్టేషన్‌ సమీపంలో ఉన్న భారత్ పెట్రోలియం డిపోకు ఎల్పీజీని రవాణా చేస్తుండగా ఈ సంఘటన జరిగింది.

సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు అర్థరాత్రి వేళ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో లూప్‌ లైన్ కొంత దెబ్బతిన్నట్లు తెలిపారు. ఎల్పీజీ ర్యాక్‌లు ధ్వంసం కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. అలాగే మెయిన్‌ లైన్‌కు ఎలాంటి నష్టం జరుగలేదని అన్నారు. దీంతో మిగతా రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలుగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement