Thursday, May 2, 2024

Birthday Memo: కేటీఆర్​ సీరియస్​.. సైకోపాతిక్​ మెంటాలినీ ఎంకరేజ్​ చేయనని ట్వీట్​

‘బర్త్ డే మెమో’ వివాదంపై మంత్రి కేటీఆర్​ సీరియస్​ అయ్యారు. రాజకీయాల్లో కానీ, పరిపాలనలో కానీ ఇట్లాంటి సైకోపాతిక్​ మెంటాలిటీని తాను ప్రోత్సహించనని తెలిపారు. ఈమేరకు ఆయన ఇవ్వాల (శుక్రవారం) ట్విట్టర్​లో స్పందించారు. తన అసంబద్ధ ప్రవర్తనకు మున్సిపల్​ కమిషనర్​ని సస్పెండ్ చేయమని @cmdatelanganaని కోరాను” అని కేటీఆర్ ట్విట్టర్‌లో రాశారు.

అసలు విషయం ఏంటంటే..

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు (కెటిఆర్) జన్మదిన వేడుకలకు హాజరుకాని బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిల్‌లోని నలుగురు సిబ్బందికి సోమవారం షోకాజ్ మెమో జారీ చేశారు. కార్యక్రమానికి రాకపోవడంతో ఉద్యోగులను వివరణ ఇవ్వాలని మెమోలో డిమాండ్ చేశారు. టి రాజేశ్వరి, ఎస్ పూర్ణచందర్, ఎ మోహన్, శ్రవణ్ అనే నలుగురు సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోరారు. లేకుంటే మీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మెమోపై స్పందించకుంటే ఉన్నతాధికారులకు తెలియజేస్తాం అని ఆ మెమోలో పేర్కొన్నారు.

అయితే.. దీనిపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఆయన ఈ మేరకు ట్వీట్ చేస్తూ, “కేటీఆర్ పుట్టినరోజుకు ఎందుకు హాజరు కాలేదని మెమోలు కోరుతున్నారా? ఇది ప్రజాస్వామ్యమా లేక రాచరికమా? మరోవైపు, కొంతమంది చిన్న ఉద్యోగులు తమ పిల్లల పుట్టినరోజు కోసం ఆహ్వానించినప్పుడు ఇంటెలిజెన్స్ అధికారులు కనిపిస్తారని ఆ ట్వీట్​లో పేర్కొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement