Monday, April 29, 2024

కామ‌న్‌వెల్త్ పోటీల్లో భార‌త బాక్స‌ర్ శుభారాంభం.. నెక్ట్స్ రౌండ్ పోటీ స్కాట్లాండ్‌తో!

కామ‌న్‌వెల్త్ పోటీల్లో భారత బాక్సర్ శివ థాపా శుభారాంభం చేశాడు. పాకిస్థాన్ ఆటగాడు సులేమాన్‌ను ఓడించి 32వ రౌండ్‌లోకి ప్రవేశించాడు. 63 కేజీల విభాగంలో ఆసియా ఛాంపియన్‌షిప్ స్వర్ణ పతక విజేత అయిన‌ థాపా 5-0 తేడాతో పాకిస్థాన్ ఆటగాడు బలోచ్‌ను 30-26, 30-25, 30-26, 30-26, 30-23 తేడాతో ఓడించాడు.

కాగా, స్కాట్లాండ్‌కు చెందిన రీస్ లించ్‌తో త‌దుప‌రి రౌండ్‌లో తలపడనున్నాడు. నెక్ట్స్ రౌండ్ జులై 31న జరగనుంది. ‘రిఫరీ స్టాప్స్ కాంటెస్ట్’ తీర్పుతో ముగిసిన భారత్ తొలి మ్యాచ్ అభిమానుల‌ కళ్లకు కనువిందు చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement