Thursday, May 2, 2024

లాలూ ప్రసాద్ యాదవ్ కి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్.. కిడ్నీ ఇవ్వనున్న ఆయన కుమారై

ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స్ తీసుకుంటున్నారు బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో గత నెల సింగపూర్‌ వెళ్లిన లాలూ.. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. లాలూని పరీక్షించిన సింగపూర్‌ వైద్యులు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకోవాలని సూచించారు. ఈ మేరకు లాలూకు కొత్త జీవితం ప్రసాదించేందుకు ఆయన కుమార్తె ముందుకొచ్చారు. వైద్యుల సూచనల మేరకు కిడ్నీ దానం చేసేందుకు సింగపూర్‌లో ఉంటున్న ఆయన చిన్న కుమార్తె రోహిణి సుముఖుత వ్యక్తం చేశారు. అయితే ఇందుకు ముందు లాలూ నిరాకరించారని.. కుమార్తె ఒత్తిడి తీసుకురావడంతో అంగీకరించాల్సి వచ్చిందని సమీప బంధువు ఒకరు తెలిపారు. కిడ్నీ మార్పిడి కోసం నవంబర్‌ 20-24 మధ్య ఆయన సింగపూర్‌ వెళ్లే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement