Friday, May 3, 2024

టీ 20 ప్రపంచకప్‌.. ఇంగ్లండ్ టార్గెట్ 169 పరుగులు..

టీ 20 ప్రపంచకప్‌లో రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 169 పరుగులు చేయాలి. హార్ధిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లో నాలుగు ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. అచ్చివ‌చ్చిన అడిలైడ్ పిచ్‌ లో కింగ్ విరాట్ కోహ్లీ మ‌ళ్లీ చెల‌రేగాడు. టీ20ల్లో 37వ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement