Friday, April 26, 2024

కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్‌ రివ్యూ మీటింగ్‌

దళితబంధుపై పథకం సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు ప్రథకంపై సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. పథకం అమలుపై అధికారులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి అధికారులు, మంత్రులు హరీశ్​రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు హజరయ్యారు. హుజూరాబాద్‌లో నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. దీనికి సంబంధించి నిధుల కేటాయింపు కూడా జరిగింది. ప్రభుత్వం ఇప్పటికే రూ.2 వేల కోట్లు కలెక్టర్ ఖాతాలో జమచేసింది.

ఇది కూడా చదవండి: కోహ్లీ వెంటనే సచిన్ సలహా తీసుకో: గవాస్కర్

Advertisement

తాజా వార్తలు

Advertisement