Friday, April 19, 2024

నర్సరావుపేటలో టీడీపీ నేతల వినూత్న నిరసన

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ గుంటూరు జిల్లా నర్సరావుపేటలో టీడీపీ నేతలు వినూత్న నిరసనకు దిగారు. ఎద్దులబండిపై బైకులు ఎక్కించి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. మరికొందరు నేతలు ఖాళీ కంచాలతో రోడ్డుపై కూర్చుని భిక్షాటన చేశారు. ఈ మేరకు గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ రేట్లపై బాదుడే బాదుడు అంటూ సీఎం జగన్ స్టైలులో నినాదాలు చేశారు.

ఏపీలో అసమర్థ సీఎం పరిపాలన చేస్తున్నాడని.. ఆయనకు పాలించడం చేతకాదని టీడీపీ నేతలు విమర్శలు చేశారు. అసమర్థ సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా టీడీపీ నేతల నిరసనలో నర్సరావుపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, నర్సరావుపేట నియోజకవర్గ ఇంఛార్జి డా.చదలవాడ అరవింద్‌బాబు సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement