Saturday, April 20, 2024

మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన సీతక్క

తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి మల్లారెడ్డి రైతుబంధు పేరుతో ఏడాదికి రూ.60 లక్షలు తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. నాలుగేళ్లలో రెండున్నర కోట్లను మంత్రి మల్లారెడ్డికి టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పన్నంగా కట్టబెట్టిందన్నారు. తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం సంపన్నులకు సంపదగా మార్చిందని సీతక్క ఫైర్ అయ్యారు.

మరోవైపు పేద తల్లిదండ్రులకు పెన్షన్ ఇవ్వమంటే మాత్రం కేసీఆర్ సర్కారు మీనమేషాలు లెక్కిస్తోందని.. చిన్న అటెండర్ కుటుంబంలో పెన్షన్ ఒకరికిచ్చి ఒకరికి కట్ చేశారన్నారు. మరి మంత్రులకు మాత్రం రైతుబంధు కావాలా అని ఆమె నిలదీశారు. కేసీఆర్ పాలన ఎవరికి పన్నీరుగా మారింది… ఎవరికి కన్నీరైందో ప్రజలు ఆలోచించాలని సీతక్క విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement