Thursday, May 16, 2024

కందికొండ మృతి సాహిత్యలోకానికి తీరని లోటు.. సీఎం కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాతిని వ్యక్తం చేశారు.గత కొద్ది కాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న కందికొండ(యాదగిరి) మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. తెలంగాణ సబ్బండవర్గాల సంస్కృతిని తనపాటద్వారా అజరామరంగా నిలిపిన వరంగల్‌ బిడ్డ కందికొండ మరణం తెలంగాణ సాహిత్య లోకానికి, సబ్బండ వర్గాలకు తీరని లోటని సీఎం కేసీఆర్‌ అన్నారు.

పాటల రచయితగా తెలుగు సినీ సాహిత్య రంగంలో తనదైన ముద్రను సృష్టించిన తెలంగాణ బిడ్డ కందికొండ అని సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. కందికొండను కాపాడుకునేందుకు ప్రభుత్వం పలు విధాలుగా ప్రయత్నం చేసినా ఫలించకపోవడం దురదృష్టకరమని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కందికొండ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement