Saturday, May 4, 2024

క‌బ‌డ్డీ ఆటలో కాలు జారి ప‌డిపోయిన ఏపీ ‘స్పీక‌ర్’ త‌మ్మినేని

ఆముదాల‌వ‌ల‌స‌లో క‌బ‌డ్డీ పోటీలు ప్రారంభ‌మ‌య్యాయి. కాగా ఈ పోటీల‌ను ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న కూడా ఆట‌గాడిలా మారిపోయారు. ఒక టీమ్ తరపున కూతకు వెళ్లారు. ఉత్సాహంగా ముగ్గురిని ఔట్ చేశారు. నాలుగో వ్యక్తిని ఔట్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి కాలు జారి కిందపడిపోయారు. దీంతో ఆయ‌న వెంట ఉండే సెక్యూరిటీ గార్డులు ఆయనను లేవనెత్తారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement