Saturday, April 27, 2024

తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన తారక్

హైదరాబాద్: తన పొలిటికల్ ఎంట్రీపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ షో ప్రోమో విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఆయన రాజకీయాలపై స్పందించారు. రాజకీయాలకు ఇది సమయం కాదని.. రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి మాట్లాడుకుందాం అని సమాధానమిచ్చారు. వేడి వేడి కాఫీ తాగుతూ రాజకీయాలపై మాట్లాడుకుందాం అని ఛమత్కరించారు. త్వరలో జెమినీ టీవోలో ప్రసారమయ్యే ‘మీలో ఎవరు కోటీశ్వరులు’షో అనేది మనీ కోసం కాదని, మనీ సెక్యూరిటీ ఇస్తుందని, ఈ షో ఏ విధంగా సక్సెస్ అవుతుందో ఉత్కంఠగా ఉందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement