Wednesday, April 24, 2024

సీతకు భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి సీతగా ఎవరు నటించబోతున్నారని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూశారు. అయితే ఎట్టకేలకు చిత్రయూనిట్ సీతగా కృతి సనన్ నటించబోతున్నట్లు ప్రకటించింది. ఇక ఆ విషయం అనౌన్స్ చేసినప్పటినుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కు భయం పట్టుకుంది. తెలుగు లో కృతి సనన్ కి సరైన హిట్ లేదు.

మహేష్ బాబు తో వన్ నేనొక్కడినే సినిమా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అలాగే నాగ చైతన్య హీరోగా దోచేయ్ చిత్రం చేసింది. ఈ చిత్రం కూడా మంచి ఫలితం రాబట్టలేకపోయింది. దీనితో అభిమానులు రిజల్ట్ విషయంలో భయపడుతున్నారు. ఇక ఈ సినిమాలో రావణాసురుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement