Monday, April 29, 2024

కమలా హ్యారిస్‌ను ‘ఫ‌స్ట్ లేడీ’ అంటూ సంబోధించిన జో బైడెన్.. అందరూ నవ్వేయడంతో..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చాలాసార్లు నాలిక మడతపడి తప్పులు మాట్లాడి నవ్వలు పాల‌వుతున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి పెద్ద తప్పు మాట్లాడేసి అభాసుపాలయ్యారు. ఈ ఘటన ‘ఈక్వల్ పే డే’ కార్యక్రమంలో వెలుగు చూసింది. ఈ కార్యక్రమానికి అమెరికా ఉపాద్యక్షురాలు కమలా హ్యారిస్ రాలేదు. ఆమె భర్త డోగ్ ఎమాఫ్‌కు కరోనా సోకినట్లు తేలడంతో కమల.. ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ విషయాన్ని వెల్లడించిన బైడెన్.. ‘‘ఈ స్టేజిపై ఎవరుండాలనే విషయంలో చిన్న సర్దుబాటు జరిగింది. ఫ‌స్ట్ లేడీ భర్తకు కరోనా సోకడంతో ఈ మార్పు తప్పలేదు’’ అని చెప్పుకుంటూ పోయారు. ఈ క్ర‌మంలో బైడెన్ ఏం మాట్లాడుతున్నార‌నే విష‌యాన్ని.. తను చేసిన తప్పు కూడా గుర్తించలేదు.

కాగా, ఆయన ఉపన్యాసం వినడానికి వచ్చిన ప్రేక్షకుల్లో ఒకరు ఈ తప్పును ఎత్తిచూపారు. దాంతో సభలోని వారంతా ఒక్క‌సారిగా నవ్వేశారు. దీంతో బైడెన్ కూడా నవ్వుతూ.. ‘‘అవును. తను బాగానే ఉంది’’ అంటూ తన భార్య జిల్ బైడెన్‌ను చూపించారు. ‘‘సెకండ్ లేడీ.. ఏమంటారు?’’ అంటూ తనను తాను కరెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఉపన్యాసం కొనసాగిస్తూ ‘‘నేను జోబైడెన్. జిల్ బైడెన్ భర్తను అయినందుకు చాలా గర్వపడుతున్నాను’’ అని అన్నారు. ఆ తర్వాత ‘ఈక్వల్ పే డే’ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. కాగా, ఫిలడెల్ఫియాలో జరిగిన ఒక పార్టీలో పాల్గొన్న ఎమాఫ్‌కు కరోనా సోకినట్లు వైట్‌హౌస్ వర్గాలు ధ్రువీకరించాయి. అదే సమయంలో కమలకు నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement