Wednesday, May 15, 2024

ముంబై నుంచి సింగపూర్​కు ఎయిర్​బస్​.. రెండేళ్ల తర్వాత పునఃప్రారంభం

సింగపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (SIA) తన ఎయిర్‌బస్ 380 సూపర్‌జంబో విమానాన్ని ముంబై నుండి తిరిగి ప్రారంభించింది. రెండేళ్ల తర్వాత మొన్న రాత్రి ముంబైలో తొలి విమానం దిగింది. ముంబై, సింగపూర్ మధ్య ఈ విమాన సేవలు కొనసాగనున్నాయి. తరువాత A380 విమానాన్ని ఢిల్లీ మార్గంలో కొనసాగనుంది. ముంబై, సింగపూర్ మధ్య SQ 424/423 వ్యాక్సినేటెడ్ ట్రావెల్ లేన్ (VTL) సర్వీస్‌లలో ఎయిర్‌బస్ A350-900 స్థానంలో A380 వచ్చిందని SIA తెలిపింది. A380 ప్రారంభ విమానం SQ 423లో సింగపూర్‌కు ప్రయాణించే ప్రయాణికులందరికీ చాక్లెట్లు, గ్రీటింగ్​ కార్డులతో స్వాగతం పలికినట్లు అంతర్జాతీయ క్యారియర్ తెలిపింది. ప్రత్యేక రిబ్బన్ కటింగ్ వేడుకతో బోర్డింగ్ ప్రారంభించినట్లు తెలిపింది.

SIA వద్ద భారత జనరల్ మేనేజర్ Sy యెన్ చెన్ మాట్లాడుతూ, “723 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మేము మా దిగ్గజ ఎయిర్‌బస్ A380ని తిరిగి ముంబైకి తీసుకురాగలిగాము. కాబట్టి SIAకి ఇది నిజంగా ఒక చారిత్రాత్మక క్షణం. మా A380 సూపర్‌జంబోకి భారతదేశంలో నమ్మకమైన అభిమానుల సంఖ్య ఉంది. ఇక్కడ ఉన్న బలమైన డిమాండ్‌ను అందుకోవడం.. ఈ కీలకమైన మార్కెట్‌లో మా కస్టమర్‌లకు మా నిబద్ధతను తెలియజేసేలా సేవలు అందించడంపై మేము సంతోషిస్తున్నాం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement